రంగవల్లిక

జై చిరంజీవ

గత ఎన్నికలు నాకు బాగా గుర్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు "జై తెలంగాణా" అంటూ తెలంగానము చేశాయి. కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కొన్ని పార్టీలు సమైక్యవాదం తమ అజెండాగా ప్రకటించాయి. పార్టీ "ఉచిత" సిద్దాంతాలు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రత్యేక తెలంగాణా అంశము వెరసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి తమ మద్దతు ప్రకటించారు. ప్రతి ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలను నెరవేర్చింది, కొన్ని హామీలను మరచి పోయింది, కొన్ని పనులను సాధించే దిశగా పయనిస్తుంది. ప్రాజెక్టులను చేపట్టింది, ఉచిత ఇల్లు, ఉచిత ఆరోగ్య భీమా, ఉచిత కరెంటు పధకాలను కొంతవరకు అమలుపరచింది. కొంత అవినీతి, కొన్ని విమర్శలు, కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరణ, ధరల పెరుగుదల వల్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షము కొంత బలపడింది. ప్రభుత్వము నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఐదవ ఏట అడుగిడింది.

ఇదంతా ఒక సంవత్సరం కిందటి పరిస్థితి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షము "అంతా బాగుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందు" అని అనుకొంటుండగా, మెగా స్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ఆ తరువాత తండ్రి ఆకస్మిక మరణం, కూతురి రహస్య వివాహము వివాదంగా మారడం వల్ల ఆ పుకార్లు నిశ్శబ్దం అయ్యాయి. ఈరోజు, రేపు, ఈ నెల , వచ్చే నెల అంటూ రోజుకో ప్రకటన వచ్చింది. హఠాత్తుగా ఒక రోజు అగ్ని పర్వతం బ్రద్దలైంది. చిరంజీవి ఆగష్టు 26న పార్టీ ప్రారంభిస్తున్నానని పార్టీ పేరు ఆ రోజు ప్రకటిస్తానని స్వయంగా ప్రకటించారు. "జై చిరంజీవ" అంటు పార్టీ పేరు పెట్టకముందే వలసలు ప్రారంభమయ్యాయి. చిరంజీవి పార్టీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ఆగష్టు 26 రానే వచ్చింది. తెలుగు ప్రజల రాజ్యం లో ఒక కొత్త అలజడి ఆవిర్భవించిది. చిరంజీవి పార్టీ "ప్రజా రాజ్యం" గా నామకరణం చేయబడింది.

చిరంజీవి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ..నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ అగ్ర స్థానాన్ని చేరి అక్కడే నిలిచిన నటుడు. మాస్ అభిమానులకి ఒక దేవుడు.. మాస్ కింగ్. డాన్స్ లో కొత్త స్టైల్, రిథం తెచ్చిన నటుడు. స్వయంకృషి , రుద్రవీణ, చంటబ్బాయి, ఛాలెంజ్ వంటి సినిమా లతో క్లాసు నటనకి ప్రాణం పోసిన వ్యక్తి. గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగ, కొదమ సింహం, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి వరుస హిట్లతో మెగా స్టార్ గా నెంబర్ ఒన్ స్థానానికి చేరుకొన్నాడు..ప్రజలకు బ్లడ్ బ్యాంకు ద్వార ఇంకొంచెం దగ్గరకు అయ్యాడు.

ఒక నాయకుడికి ముందు చూపు ఉండాలి అనేది నా అభిప్రాయం. చిరంజీవి గారికి అది చాలా ఉంది. నాయకుడు ఒక అజెండా , ఒక ప్లాన్ , ఒక ఆశయం తో ముందుకి రావాలి. అటువంటి నాయకుడిగా రుపుదిద్దుకోవడానికి చిరంజీవికి ఇంకొంత సమయం కావాలి. ఇంకొన్ని మార్పులు చెసుకోవాలి..స్పష్టత ఉండాలి. శ్రీశ్రీ గారి మహా కావ్యం "మహా ప్రస్థానం" లోని మరో ప్రపంచానికి చేరువగా పరుగు తేయాలి.. ముందుకు పోవాలి.. అప్పుడు ఒక ఓటరుగా స్పష్టంగా చిరంజీవి పార్టీ కి ఎందుకు ఓటు వెయ్యాలనే సందేహం తెరుతుంది.. చిరంజీవి పార్టీకి ఒక్క సీటు కూడా రాదని కొందరు, స్పష్టత లేదని కలలు కంటున్నాడని కొందరు విమర్శించినా, అన్ని సీట్లు మావే నంటు కొందరు ఎక్కువ చేసి చెప్పినా ఒకటి మాత్రం నిజం - చిరంజీవి ప్రభావం రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఉంటుంది.

జై చిరంజీవ నినాదం నెమ్మదిగా అన్ని పార్టీల నాయకులకు చేరుతోంది. ప్రభుత్వం నుంచి, ప్రతిపక్షం నుంచి నాయకులూ ప్రజా రాజ్యం లో చేరారు. ప్రధాన ప్రతిపక్షం బలహీన పడుతోంది. సినీ బలం కోసము తెలుగు దేశం పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. మన రాష్ట్ర రాజకీయ చరిత్ర లో ఒక నూతన ఒరవడికి శ్రీకారము అయ్యింది. సినీ నటులు రాజకీయాన్ని ప్రభావితం చేసే రోజులు వచ్చాయి. ప్రతిపక్షం ముక్కలవుతుంది. ప్రభుత్వంలో కూడా చీలికలు మొదలయ్యాయి. సినీ వర్గంలో గ్రూపులు ప్రారంభం అయ్యాయి...

సగటు ఓటరు ఆలోచనలో పడ్డాడు..ఒక వైపు తెలంగాణా నినాదం మరో వైపు జై చిరంజీవ నినాదం, ఒక వైపు ఉచిత కరెంటు మరో వైపు హైటెక్ రాజ్యం...ఎవరు ఎవరితో పొట్టు పెట్టుకొంటారో తెలియని స్థితి..ఈ అనిచ్చితిని ఓటర్లు ఎలా చేదిస్తారో .. మన 'తెలుగు దేశ' 'ప్రజల రాజ్యం' ఎవరి 'హస్తం' లో ఉంటుందో ..'తెలంగానం' ఎంతవరకు ప్రజలు వింటారో..అంతా ఓటరు హస్తం లో ఉంది. విజయం సాధిస్తే మరో ఐదేళ్ళ వరకు చిరంజీవి.

ఇది నా సొంత అభిప్రాయం..తప్పులుంటే సరి దిద్దుకోండి. క్షమించండి (తెలుగు భాష లో చిరంజీవికి నచ్చని పదం). జై ఆంజనేయ - జై చిరంజీవ !

లేబుళ్లు:

1 కామెంట్‌లు:

Anonymous అజ్ఞాత చెప్పారు...

hii..its really very nice..article.

5 నవంబర్, 2008 11:24 PMకి  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్